సిరా న్యూస్,నిజామాబాద్;
రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీ రైతులకు వెంటనే అందజేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటు తెలంగాణ ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీ విలీనమంటూ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… కాంగ్రెస్ నాయకులు పదేపదే ఇందిరమ్మ రాజ్యమని మాట్లాడుతున్నారన్నారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వచ్చేలా ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పాలన పట్ల విసుగు చెందారన్నారు