సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సున్నంబట్టి ఆశ్రమం పాఠశాలను ఆకస్మికి తనిఖీ చేశారు.విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన మంత్రి విద్యార్థులు పెద్దవాళ్ళు అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం అక్కడి వసతులపై ఆరా తీశారు. భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదని,స్వయంగా తానే వచ్చాను గనుక ఎలాంటి లోటు పాట్లున్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానన్నారు.