సిరా న్యూస్,కోనసీమ;
కొత్తపేట నియోజకవర్గం, వానపల్లి లో ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామసభ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వానపల్లి వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ తో పాటు మరికొన్ని ప్రదేశాలను పరిశీలించారు, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తో పాటు ఎస్పి బి.కృష్ణారావు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నారు .ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
====================