కుటంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్న చిరు
సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి దర్శించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి చిరంజీవిని పట్టువస్త్రంతో సత్కరించారు. చిరు జన్మదినం సందర్భంగా స్వామి వారి సేవలో పాల్గొనటం విశేషం. ఆలయం వెలుపల వచ్చిన చిరంజీవిని చూసేందుకు భారీ స్థాయిలో అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపారు.