శ్రీవారి సుప్రభాత కుటుంబ సమేతంగా సేవలో పాల్గొన్న మంత్రి ఆనం

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవైన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ….ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ కు, సహచర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంచి సుపరిపాలన అందించడం ద్వారా ప్రజలకు మేలు కలగాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు. టీటీడీలో అనేక అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ విచారణ సాగిస్తుందని తెలిపారు. నివేదిక ఆధారంగా తప్పు చేసింది ఎంత పెద్దవారైనా సరే శిక్ష పడేలా చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *