సిరా న్యూస్,మంత్రాలయం;
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం 353వ ఆరాధనోత్సవాలలో భాగంగా నేడు శ్రీ రాఘవేంద్రస్వాములు వారు బృందవనం ప్రవేశం చేసిన కావున
శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్ధులు మధ్యారాధన సందర్భంగా మూల బృందవనానికి పాలతో వివిధ రకాల ఫలాలతో విశేష పంచమృత అభిషేకం నిర్వహించి తులసి అర్చన తదితర విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రతిమను బంగారు రథం పై ఉంచి రాఘవేంద్రస్వామి సన్నిధిలో భక్తుల నామస్మరణ హర్శద్వానాల మధ్య మఠం ప్రాగంణంలో ఊరేగించారు. మధ్యారాధన సంధర్భబంగా స్వామి వారి దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భారీ ఎత్తున శ్రీమఠంలో భక్తులతో కిట కిట లాడింది.