సిరాన్యూస్, నాంపల్లి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ దువ్వా నవీన్
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ దువ్వా నవీన్ అన్నారు. గురువారం నాంపల్లి మండలం పరిధిలోనీ చలవనికూంటలో మండల వైద్యాధికారి డాక్టర్ ఇశ్రాత్ ఆదేశాల మేరకు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామంలోని 50 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు అంజమ్మ, రజిత,పద్మ, చెన్నమ్మ, అరుణ పాల్గొన్నారు.