సిరాన్యూస్,బేల
ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి: ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా మావలలోని మహాత్మ జ్యోతిభాఫులే రెసిడెన్షియల్ (జైనథ్) విద్యార్థులను వేధిస్తున్నప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ విద్యార్థులకు టీసీలు ఇస్తామని మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నారు. విద్యార్థులను ఇలా వేధించడం సరికాదన్నారు.వెంటనే ప్రిన్సిపాల్ పై అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశంలో ఏబీవీపీ నాయకులు ఓం ప్రకాష్, రేసు మనోజ్ రెడ్డి, రాపెళ్లి వార్ కృష్ణ, అనోజ్ రెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.