సిరాన్యూస్,ఇచ్చోడ
నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది : ఎంపీడీవో లక్ష్మణ్
నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, మొక్కలను సంరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో లక్ష్మణ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జున్ని గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదిలాబాద్ జిల్లా జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మణ్ మాట్లాడుతూ మొక్కలు నాటితే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అన్నారు. ప్రస్తుతం మనం నాటిన మొక్కలే వృక్షాలై మన భవిష్యత్తు తరాలకు ప్రాణ వాయువును అందిస్తాయన్నారు. నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో లక్ష్మణ్, గ్రామస్తులు అదిలాబాద్ జిల్లా జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గుట్టే మాధవ్, ఉపాధి హామీ ఏపీవో నరేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.