సిరా న్యూస్,మంథని;
పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లో పాల్గొన్న పుట్ట మధు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూటకో మాట గంటకు విషయం చెబుతూ రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని తప్పుదోవ పట్టించడానికి కెసిఆర్, కేటీఆర్ లను దూషపద జాలంతో తిట్టడం, పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయడం మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారుని క్యాబినెట్ హోదా ఇచ్చి వ్యవసాయాన్ని ఎలా గంగలో కలపాలో సలహాలు తీసుకుంటున్నడు రేవంత్ రెడ్డి అని అన్నారు. మంథని సిఐ మా మీద ఆంక్షలు పెడుతున్నాడు ఒక్క నిమిషంలో ఇక్కడి నుండి వెళ్లిపోవాలని మంథని చరిత్ర పోలీసులకు తెలుసు మీరు పునరావృతం చేస్తే మేము పునరావృతం చేస్తాం బిఆర్ఎస్ పార్టీ మీ బెదిరింపులకు మీ వుకదంపుడు మాటలకు భయపడదు మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటామంటే కొనిస్తామని ఘాటైన వ్యాఖ్యలు చేసిన పుట్ట మధు.