సిరా న్యూస్,అదిలాబాద్;
ఆదిలాబాద్ జిల్లా మత్మజ్యోతిబా ఫూలే జైనాథ్ పదవ తరగతి విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గురువారం ఉదయం 3:00 గంటలకు స్కూల్ గోడ దూకి దాదాపు 46 మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చెయ్యాలని లేదంటే మేము స్కూల్ కు వెళ్ళమని టూ టౌన్ పోలీసు స్టేషన్ లో బీష్మించుకుని కూర్చున్నారు. వసతుల పై నిలదీస్తే టార్గెట్ చేస్తుందని అన్నారు. మీరు ఎక్కడి వెళ్లినా నన్ను ఎం చెయ్యలేరు అని మీకు టి సి లో బ్యాడ్ రాస్తా అంటు విద్యార్థులకు బ్లాక్ మెల్ చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసారు. బాధలు భరించలేకే కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోనెదుకే సిద్ధమయ్యారని తెలిపారు