సిరా న్యూస్,సూర్యాపేట;
తిరుమలగిరి లో ఉద్రిక్తత నెలకొంది. రుణ మాఫీ పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆద్వర్యం లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు.
మరోవైపు రుణ మాఫీ విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్తమంత్రి కి పాలాభిషేకం చేసేందుకు అక్కడికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుచేసుకున్నారు. ఇరువర్గాలు పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. చిరవకు పరస్పరం రాళ్ళ దాడికి దిగారు. ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. పోలీసులు బలప్రయోగం చేసి ఇరువర్గాలను చెదరగోట్టారు.