రైతులను మోసం చేసిన కాంగ్రెస్

తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
-ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
-భవిష్యత్తులో ఆందోళనలు తప్పవు
;సిరా న్యూస్,తాండూర్;
ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని తాండూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బా దత్తమూర్తి, మాజీ ఎంపీపీ పూసాల ప్రణయ్ కుమారులు మండిపడ్డారు.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు గురువారం తాండూర్ మండల కార్యాలయం ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించి, తహసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని వారు సూచించారు. లేకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దాగం నారాయణ, మాజీ సర్పంచ్ క్రిస్టఫర్, ప్రజాప్రతినిధులు మందికుంట్ట రాంచందర్,బోనగిరి చంద్రశేఖర్,స్వామి,సంతోష్, చింటూ,క్రాంతి కుమార్,రైతులు
తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *