సిరా న్యూస్, సూర్యాపేట:
అంగరంగ వైభవంగా ఇరుముడి మహోత్సవం..
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో ఇరుముడి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం అయ్యప్ప స్వాములు 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గ్రామస్తులు స్వాములును పూలమాలలతో సన్మానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.