చుక్క నీరు చేరలేదు– పరిహారం రాలేదు

సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ భూ నిర్వాసితులకు మంత్రి తుమ్మల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
సిరా న్యూస్,ఏన్కూరు;
సీతారామ ప్రాజెక్టు పంపు హౌజ్ లు ఆగస్టు 15 ప్రారంభం చేసిన సాగర్ లింక్ కెనాల్ కు ఒక చుక్క నీరు చేరలేదు– అని భూ నిర్వాసితులకు పరిహారం రాలేదు అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం తెలంగాణ రైతు సంఘం బృందం లింక్ కెనాల్ ను పరిశీలన చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బానోతు బాలాజీ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ పనులు పూర్తి కావడానికి మరో రెండు సంవత్సరాలు పైగా సమయం పడుతుంది అని అప్పటి వరకు పూర్తి అయిన కాలువలు ద్వారా సాగర్ ఆయకట్టు పరిధిలో కొన్ని మండలాల్లో సాగు భూములకు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ను ఏన్కూరు మండలం సాగర్ కాలువ హైడ్ రెగ్యులేటరీ వద్ద అనుసంధానం చేయుటకు లింక్ కెనాల్ 8 కిలోమీటర్ల నిర్మాణం చేయుటకు సంకల్పించి భూ సేకరణ గేజిట్ నోటిఫికేషన్ లేకుండా పరిహారం అవార్డు ప్రకటించకుండా పనులు ప్రారంభం చేసింది అన్నారు.
రైతులు కాలువలు నిర్మాణం పై అభ్యంతరం వ్యక్తం చేశారు ఉద్యమం ప్రారంభం కావడం తో
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చోరవ చూపి రైతులకు సరైన నష్టపరిహారం అందించే హామీ ఇచ్చారు, ఆగస్టు లో సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతులు మీదుగా పరిహారం అందిస్తామని మాట ఇచ్చారు. జిల్లా లో సినీయర్ మంత్రి తుమ్మల పై ఏన్కూరు ప్రాంత రైతులకు ఉన్న గౌరవం తో భూమి పరిహారం అందించకుండనే కాల్వలు నిర్మాణం కు రైతులు పూర్తిగా సహకరించారు కానీ ముఖ్యమంత్రి ఆగస్టు 15 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి సీతారామ ప్రాజెక్టు పూసు గూడెం పంపు హౌజ్ ప్రారంభం చేసి వైరా నియోజకవర్గ కేంద్రం లో సాగు కు జీవం రైతుకు ఊతం సభ లో పాల్గొన్న లింక్ కెనాల్ భూ నిర్వాసితులకు పరిహారం పై ఏలాంటి స్పష్టత ఇవ్వలేదు అని రాంబాబు, బాలాజీ అన్నారు.
ఏన్కూరు మండలం లో హిమామ్ నగర్ , ఏన్కూరు రేపల్లె వాడ జూలూరుపాడు మండలం లో వినోబా నగర్ లో రెండు పంటలు పండి ఆధిక దిగుబడులు వచ్చిన సారవంతమైన భూములు లింక్ కెనాల్ కోసం 100 ఎకరాలు భూ సేకరణ జరిగింది అని ఎకరాకు బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఏబై లక్షల రూపాయలు పరిహారం అందించాలి అని కోరారు, పామ్ ఆయిల్ తోటలు కాల్పోయిన రైతులకు నాలుగు సంవత్సరాల పెంచిన తోట లో ఒక చెట్టు కు 2001 చట్టం ప్రకారం మూడు, నాలుగు వందల రూపాయలు పరిహారం లెక్క వేయడం సరికాదని ఒక ఎకరం విస్తీర్ణంలో 57-60 పామాయిల్ మొక్కలు పెంచడం జరుగుతుంది నాలుగు సంవత్సరాల కౌలు ఎకరాకు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది మొక్కు రెండు వేల కౌలు ఖర్చు, ఎరువులు పురుగుమందులు కూలీల, సాగు నీరు నాలుగు సంవత్సరాల ఖర్చు కలిపి అదనంగా మూడు రేట్లు కలిపి పామాయిల్,ఇతర పండ్ల తోటలు పరిహారం అందించాలి అని రాంబాబు బాలాజీ డిమాండ్ చేశారు భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించాలి అని లేకపోతే రైతు ఉద్యమం తప్పదు అని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దోంతిబోయిన నాగేశ్వరరావు రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తమ్మినేని వెంకటయ్య,గుండా సత్యనారాయణ రెడ్డి రేపల్లె వాడ మాజీ ఎంపిటిసి భూక్యా లక్ష్మా, గార్లఒడ్డు సోసైటి వైస్ చైర్మన్ రేగళ్ళ తిరుమల రావు, ఇంజం వేణు,ఇటికాల లెనిన్ రాయమాధరం మాజీ సర్పంచ్ కోడెం బిక్షం, నామా కృష్ణారావు, బాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *