సిరా న్యూస్,మహబూబ్ నగర్;
ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తి పదు నైనా ఆయుధంతో గొంతు కోసి వెళ్లాడు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని శ్రీని వాస కాలనీకి చెందిన జి.సిరి కాలనీలోని పార్క్ లోతోటి పిల్లలతో కలిసి కాసేపు ఆడుకుని తిరిగి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇం టి ముందు ఉన్న పాపను గుర్తు తెలియని వ్యక్తి వాహనంపై వచ్చి పదునైనా ఆయుధంతో కోసి వెళ్లాడు. రక్తంతో ఇంట్లోకి వెళ్లిన సిరి పాపను గమనించిన తల్లి వెంటనే చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. దీంతో పాపకు గొంతు భాగంలో సర్జరీ చేసి కుట్లు వేశారు. గొంతు దగ్గర లోతుగా తెగక పోవడం తో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం స్థానికంగా ఉన్న సీసీ కెమె రాలు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కాగా గంజాయి మత్తులో ఈ దారుణానికి వడిగట్టినట్టు తెలుస్తోంది..
======