సిరాన్యూస్, సామర్లకోట
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని పులిమెరు గ్రామంలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్ ను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ఈసందర్బంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో స్థితిగతులను పరిశీలించారు. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన ఆసుపత్రి వైద్యులతో మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధులు, సీజనల్ వ్యాధులు వస్తాయి అని ,ఎప్పటికపుడు ఆసుపత్రి లో డస్ట్ బిన్స్ ను క్లీన్ చేసే లాగా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కారేడ్ల రాజు, జానసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.