సిరా న్యూస్,నందిగామ;
తనపై అసభ్య మీమ్స్ బహిరంగ సభల్లో ట్రోల్ చేశాడని వైసిపి నేత షేక్ కరిముల్లా(దుబాయ్ ),కోడుకు షాహిల్ పై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పిర్యాదు చేసారు. షేక్ కరిముల్లా(దుబాయ్), షేక్ షాహిల్ పై పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసారు.
జగన్నన్న వాక్ వే ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై మీమ్స్ వేసి కించపరిచారని ఫిర్యాదు చేసారు.దుబాయ్ లో ఉన్న కరిముల్లా, నందిగామకు వచ్చారని సమాచారం తో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.