వైభవంగా సబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తీర్ధం

సిరా న్యూస్,అమలాపురం;
గోదావరి జిల్లాలో విశిష్టంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి తీర్థం జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లాలో ఉన్న ప్రముఖ సుబ్రమణ్య క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమలాపురం, మాచవరం, గుత్తిని దీవి, ఏ. వేమవరం తో పాటు పలుచోట్ల కొలువు దీరిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించిన ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుండే భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *