సిరా న్యూస్,మేడ్చల్;
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి తండా 2లో శుక్రవారం మహిళ దారుణ హత్య జరిగింది. గదిలో ఉన్న ఆమెను కొట్టి చంపి దుప్పటి కప్పి వెళ్లిన దుండగులు అని సమాచారం ఉన్నది. మృతురాలు తండా కు చెందిన జరుపాలా శాంతి (45)గా గుర్తించారు. దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.