సిరా న్యూస్,పెద్దపల్లి;
మాజీ హోంగార్డు దారుణ హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరులో గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్ ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భూ వివాదం వల్లే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా మృతుడు విజయ్ కి భూమి విషయంలో బంధువులతో గొడవ జరుగుతుండేదని మృతుని సోదరుడు తిరుపతి తెలిపారు .సమాచారం
అందుకున్న పెద్దపల్లి ఏసిపి కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.