సిరా న్యూస్, బోథ్:
బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మేల్యే అనిల్ జాదవ్…
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నుర్ గ్రామంలో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. గ్రామం నుండి నుండి రాష్ట్రంలోని నాగపూర్ వరకు రూ. 2.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను జెడ్పీటీసీ గా ఉన్నపుడు ఈ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయించానని అన్నారు. తాను శాసన సభ్యుని గా గెలిచిన తరువాత పనులు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూలమాలలు శాలువతో ఆయనను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.