సిరాన్యూస్, బోథ్
కన్గుట్టలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కన్గుట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా నోడల్ ఆఫీసర్ పోశెట్టి మాట్లాడుతూ వరుసగా సెలవులు రావడంతో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలందరూ చాలా సంతోషంగా శ్రీకృష్ణ అలాగే గోపికల వేషధారణలో రావడం జరిగిందని, శ్రీ కృష్ణాష్టమి యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేసి, సంస్కృతి సంప్రదాయాలను అలవర్చడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత పిల్లలందరూ ఉట్టి కొట్టడం పిల్లల కేరింతల మధ్య సాగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్ , రవీందర్ ,రాజేశ్వర్ , సుబ్బారెడ్డి , ప్రహ్లాదు, చిలుక సతీష్ , మౌనిక, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.