Gatlanersingapore: గట్లనర్సింగపూర్‌లో వ్యవసాయ భూమి వద్ద గొడవ.. దంపతులపై దాడి

సిరాన్యూస్, భీమదేవరపల్లి
గట్లనర్సింగపూర్‌లో వ్యవసాయ భూమి వద్ద గొడవ.. దంపతులపై దాడి
* పశువుల కోసం వాడుకుంటున్న స్థలంలో వివాదం
* దాడిచేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు

వ్యవసాయ భూముల వద్ద పశువుల కోసం వాడుకుంటున్న ప్రభుత్వ స్థలంలో జరిగిన గొడవ దంపతులపై దాడికి దారితీసింది. ఈసంఘ‌ట‌న హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో శ‌నివారం చోటు చేసుకుంది. బాధితులు మెరుగు రాజయ్య, మెరుగు శోభ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో మెరుగు రాజయ్య, మెరుగు శోభ వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తమ పాడి పశువులను వీరి భూమి పక్కనే ఉన్న స్థలంలో పశువుల కొట్టం ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. ఆ భూమిని మీరు వాడుకోవద్దని అదే గ్రామానికి చెందిన బరిగె మీనయ్య అతని భార్య స్వరూప, కొడుకు విజయ్ అభ్యంతరం తెలిపారు. ఇది ప్రభుత్వ స్థలమని మేము వాడుకుంటే మీకు అభ్యంతరం ఎందుకని రాజయ్య దంపతులు అడిగారు.సదరు భూమి మాకు కావాలని తిడుతూ శుక్రవారం నాడు రాజయ్య అతని భార్య శోభను కొట్టారని వాపోయారు.కాగా బాధితుడు మెరుగు రాజయ్య దంపతులు అదేరోజు సాయంత్రం ములుకనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న కొంత ప్రభుత్వ భూమిని సుమారు 20 ఏండ్లుగా వాడుకుంటున్నానని, పశువుల పాక, గడ్డివాము, కల్లం బండ ఏర్పాటు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు భూమికి సంబంధంలేని వ్యక్తి బరిగె మీనయ్య, ఈ ప్రభుత్వ భూమి తమదని మీకు ఈ భూమితో సంబంధం లేదని మెరుగు రాజయ్య దంపతులపై దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మీడియాతో బాధితులు రాజయ్య అతని భార్య శోభ మాట్లాడారు. తనతో పాటు చుట్టుపక్కల భూముల వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ భూమిలో పశువుల పాకలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.ఈ స్టల వివాదంపై శనివారం భీమదేవరపల్లి తహాసిల్దార్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినట్లు బాధితులు తెలిపారు. సోమవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లను పంపించి విచారణ చేపడతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *