సిరా న్యూస్,హైదరాబాద్;
అత్యంత గ్లామరస్ ఈవెంట్ లలో ఒకటైన జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణా హోట ల్లో ప్రారంభమైంది. ఈ మూడు రోజుల పాటు ఈ ఆభరణాల ప్రదర్శన ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు తమ బ్రాండ్లను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. అరుదైన, కనువిందు చేసే డిజైనర్ ఆభరణాలు ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మహిళల మనస్సును దోచే రీతిలో ఇక్కడ ప్రధాన ఆభరణాల తయారీ దారులు జైపూర్కు చెందిన జీకే చుడీవాలాస్, బహేతి జెమ్స్ అండ్స్ జ్యువెలర్స్, ముంబాయికి చెందిన దివా జ్యువెలర్స్, చెన్నైకి చెందిన జ్యువె లర్స్ క్రియేషన్స్, సూరత్కు చెందిన ఇవానా జ్యువెలర్స్ ఇక్కడ తమ ఆభరణాల డిజైనర్లను అందుబాటులో ఉంచారు.