డియర్ సీఎంగారు… ఇప్పుడు ఉద్యోగామా….

హార్ట్ టచింగ్ లెటర్ రాసిన నళిని

సిరా న్యూస్,హైదరాబాద్;
దోమకొండ నళిని… ఈ పేరు కొంత మందికే తెలుసు.. కానీ డీఎస్పీ నళిని అంటే మాత్రం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మూడు కోట్ల తెలంగాణ ప్రజలకు సుపరిచితం. స్వరాష్ట్రం కోసం ఉద్యోగాన్ని గడ్డిపోచలా వదిలేసిన ఉద్యమకారిణి. తెలంగాణ ఉద్యమ సమయంలో తనవారిపై లాఠీ ఝళిపించలేదె.. మా రాష్ట్రం మాకు కావాలని ఉద్యమిస్తున్న యువకుల గుండెలపై తుపాకీ గురిపెట్టలేక.. ఇటు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక.. కష్టపడి సాధించిన కొలువును తీసి అవల పడేసింది. తెలంగాణ ఉద్యమ పార్టీగా స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత టీఆర్‌ఎస్‌(ఇప్పుడు బీఆర్‌ఎస్‌)కు 2014లో ప్రజలు పట్టం కట్టారు. ఉద్యమకారును ఆదుకుంటామని చెప్పిన నాటి సీఎం కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయారు. పోలీస్‌ కిష్టయ్య బిడ్డను డాక్టర్‌ చదివించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలు.. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ఇంకా 600 మందిని గుర్తించలేదు. ఇక ఉద్యోగాన్ని వదిలేసిన డీఎస్పీ నళిని, తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కనీసం గౌరవం ఇవ్వలేదు. పదేళ్లు గడిచాయి. ప్రభుత్వాన్ని మార్చేశారు ప్రజలు. ఈ నేపథ్యంలో నళిని అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉద్యోగం ఇవ్వాలని కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కానీ, కొలువును నళిని సున్నితంగా, వినమ్రంగా తిరస్కరించారు. ఈమేరకు సీఎంకు రాసిన లేఖ.. గుండెను హత్తుకునేలా ఉంది.గౌరవ నీయులైన ముఖ్యమంత్రి గారికి..! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళుల చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్‌లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్‌ ఆఫీసర్‌గా ‘సోషల్‌ స్టిగ్మా (మరక) ’ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009, డిసెంబర్‌ 9 న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే, నేను రాజీనామాను విత్‌ డ్రా చేసుకొని డిపార్ట్‌మెంట్‌లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్లో పోస్టింగ్‌ ఇచ్చి, నాకు ఛార్జ్‌ మెమోలు ఇచ్చి వివరణ కోరడం, ఎక్స్ప్లనేష¯Œ ్స రాయమనడం, రిమార్క్‌ రాయడం, బ్యాచ్‌లో నా ఒక్క దానికే ప్రమోషనన్ను ఆపేయడం, ప్రోబేషన్‌ పీరియడ్‌ ఎక్సె్టండ్‌ చేయడంవంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్‌ కంటే హీనంగా ట్రీట్‌ చేశారు. విషయాలన్నీ నన్ను ఆనాటì సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్మెంట్‌ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయక పోగా, ఎగతాళి చేశారు. తెలంగాణచిన్నమ్మ సుష్మా స్వరాజ్‌ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది.తెలంగాణ కోసం ఒకవైపు, వేధింపులు తట్టుకోలేక ఒకవైపు ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్నా. ప్రజల్లోకి వెళ్లా.. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంతో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్‌ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్‌ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్‌మెంట్‌పై ఏహ్య భావం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *