Samala Veeranna: సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యం:రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి సామల వీరన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యం:రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి సామల వీరన్న

సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి సామల వీరన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 5వ మహా సభలు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి సామల వీరన్న హాజ‌రై మాట్లాడారు. దేశాభివృద్ధి జరగాలంటే అది సైన్స్ తోనే సాధ్యం అని,శాస్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పరిశోధనలు జరగాలని, ప్రభుత్వాలు కూడా పరిశోధన రంగంలో అధిక నిధులు కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో సైన్స్ లో పరిశోధనలకు ప్రాదాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ , లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రకాష్, లిటిల్ స్టార్ కరస్పాండెంట్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *