ఉద్యమకారులందరికి ఇంటి స్థలం కేటాయించాలి

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 250గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఓయూ ఆర్ట్స్ కాలేజి సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఓయూ, టీఎస్ జేఏసీ చైర్మన్ భట్టు శ్రీహరినాయక్ మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సముచితస్థానం కల్పించాలన్నారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులకు రాష్ట్రప్రభుత్వం త్వరలో భర్తీచేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తమ డిమాండ్ల సాధనకై త్వరలో ముఖ్యమంత్రిరేవంత్రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *