సిరా న్యూస్,ఖమ్మం;
సాగర్ కాలువలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి గుజ్జుల కోటేష్ (35)అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న సాగర్ కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతు అయ్యాడు. పోలీసుల సహాయంతో మృతదేహాన్ని సోమవారం ఉదయం గజ ఈతగాళ్లు బయటకు తీసారు. గుంటూరుకు చెందిన గుజ్జుల కోటేష్, తమ్ముణ్ణి చూసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయాడని బంధువులు రోదించారు.