మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి
సిరా న్యూస్,కోరుట్ల;
నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి హెచ్చరించారు.. సోమవారం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు రెస్టారెంట్, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు మరియు కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను స్వాధీన పరుచుకొని అట్టి కుళ్ళిన ఆహార పదార్థాలను డంపింగ్ యార్డ్ లో గుంత తీసి పూడ్చడం జరిగింది. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్ , హోటళ్ల యజమానులకు 32 వేల రూపాయలు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పట్టణంలో రెస్టారెంట్లు నిర్వహించే యజమానులు ప్రస్తుత వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని అంటూ వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని మాత్రమే ప్రజలకు విక్రయించాలన్నారు. నాసిరకం, కల్లీన ఆహార పదార్థాల వ్యాపారుల నిర్వాహలకు ఉద్దేశించడం తగదన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధించి,చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, మున్సిపల్ సిబ్బంది జగ్గల్ల రమేష్, సానిటర్ జవాన్ లు చిట్యాల గాజం, చిట్యాల రమేష్ , చిట్యాల రాజ్ కుమార్ ఉన్నారు..
=======================XXX