సిరాన్యూస్, బోథ్
వీధి వ్యాపారులకు గొడుగులు అందజేత : మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వీధి వ్యాపారుల ఇబ్బందులను గుర్తించి గొడవలు అందజేయడం జరిగిందని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ తెలిపారు. సోమవారం మండల కేంద్రం చెందిన అంజనబ్బాయి మండుటెండలో తన వీధి వ్యాపారాన్ని నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు గమనించి ఆమెకు గొడుగునందించమన్నారు. రానున్న రోజుల్లో మరో నలుగురు మందికి అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు వేముల కిష్టయ్య, ఓటకరి సాయి, రోహిత్ జిల్లేది, శ్రీధర్, అల్లకొండ రవి, ఆకుల భోజన్న, ప్రజలు పాల్గొన్నారు