కళ్యాణ ఏర్పాట్లలో కనిపించని మామిడి తోరణాలు, అరటి చెట్లు
సిరా న్యూస్,విజయవాడ;
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ నందు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల దివ్య కళ్యాణం సందర్భంగా స్వామి వార్ల ఉత్సవ విగ్రహములు పల్లకిలో ఊరేగింపుగా మేళ తాళాలతో శ్రీ అమ్మవారి మహా మండపం ధర్మ పదం దగ్గర స్వామివారి కల్యాణ ఏర్పాట్లు జరగగా మామిడి తోరణాలు అరటి చెట్లు లేక మండపం వెలవెల పోయింది. ఇది గమనించిన అధికారులు కాంట్రాక్టర్ ను నిలదీయగా అప్పుడు తోరణాలు అరటి చెట్లు మండపం దగ్గర కు తెచ్చారు. మీడియా ప్రతినిధులు వీడియో తీయండంతో అధికారులు స్పందించారు. అప్పటికప్పుడు తోరణాలు అరటి దిమ్మలు హడావుడిగా కట్టారు.