సిరా న్యూస్,చండీఘర్;
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. పఠాన్ కోట్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో శుక్రవారం ఓ నకిలీ మహిళా టీటీఈ పట్టుబడటంతో కలకలం రేగింది. పటాణ్ కోట్ నుంచి చింద్వారా వెళ్లే పఠాన్ కోట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో వసూళ్లు చేపట్టింది. ఇలా రైలులో ప్రయాణిస్తున్న వారిలో టికెట్లు లేని వారి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేయడం మొదలు పెట్టింది. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.