సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం చాకిరేవుపాలెంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న శొంఠి నాంచారమ్మతోపాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్ పేట సీఐ యేసుబాబు మీడియాకు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశామన్నారు. నిర్వాహకురాలు శొంఠి నాంచారమ్మ గతంలోనూ వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్టు సీఐ తెలిపారు.