జేసీ ప్రభాకర్ రెడ్డి
సిరా న్యూస్,తాడిపత్రి;
తాడిపత్రి నియోజకవర్గంలో 25 మంది అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని, ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ తనకు దూరం కావద్దంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా 25 మంది రవాణా చేస్తున్నారని వారికి దయచేసి చెబుతున్నానని ఇసుక అక్రమ రవాణా మానుకోవాలని అయన హెచ్చరించారు.
గతంలో అక్రమ ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రయోజనం లేదన్నారు. నాకోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారని, ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావొద్దన్నారు.
ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామన్నారు. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు బాగా తెలుసన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టనన్నారు. మీరేనా డబ్బులు సంపాదించుకునేది నియోజకవర్గంలో మిగతావారు లేరా? అని ప్రశ్నించారు.