సిరా న్యూస్,సికింద్రాబాద్;
ప్రేమ విఫలమై ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పవన్ కుమార్ (34) ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని ఆర్పిఎఫ్ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 23వ తారీకు ఉదయం పిటి కి హాజరు కాకపోవడంతో అతనికోసం బెటాలియంలో వెతకడం మొదలుపెట్టారు, మధ్యాహ్నం అయ్యే సరికి బెటాలియన్ లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో కేబులు వైర్లతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు పవన్ కుమార్ తన గ్రామానికి చెందిన యువతీతో ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన జేబులో ఉన్న లేఖలో పేర్కొన్నాడు , సంబంధిత విషయంపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు