సిరాన్యూస్, బేల
ఏజెన్సీ బంద్ సంపూర్ణం : ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు సీడం నందు కుమార్
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం చేపట్టిన ఏజెన్సీ బంద్ సంపూర్ణంగా కొనసాగిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు సీడం నందు కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీమ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఏజెన్సీ బంద్ కార్యక్రమానికి ఆదివాసి సంక్షేమ పరిషత్, రాయి సెంటర్ బేల మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి.. పోతున్నాయి కానీ ఆదివాసులకు అన్యాయాలు జరుగుతూనే ఉందని ఆరోపించారు. ఇకనైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు న్యాయం చేసే విధంగా చూడాలని కోరారు. సమావేశంలో రాయి సెంటర్ అధ్యక్షులు కోరెంగా సోనెరావ్, నాయకులు మడావి భీం రావ్,జుగ్నాక్ మానిక్ రావ్, పర్చాకి నాందేవ్, తదితరులు పాల్గొన్నారు.