Boath Co-operative Society: బోథ్ స‌హ‌కార సంఘంలో అక్ర‌మాల‌పై విచార‌ణ

సిరాన్యూస్‌, బోథ్‌
బోథ్ స‌హ‌కార సంఘంలో అక్ర‌మాల‌పై విచార‌ణ
* ఆరోపణలు నిరూపిస్తామంటున్న డైరెక్టర్లు
* బాధిత రైతు భార్యను విచారిస్తున్న అధికారులు

ఆదిలాబాద్ జిల్లా బోథ్ సహకార సంఘంలో అక్రమల చిట్టా రోజురోజుకు బయటపడుతోంది. గతంలో జరిగిన అక్రమాలపై సహకార సంఘం డైరెక్టర్లు పలు ఆరోపణలు చేస్తూ తగు విచారణ చేపట్టాలని జిల్లా సహకార సంఘం అధికారులకు విన్నవించారు. దీంతో మంగళవారం జిల్లా సహకార సంఘం అధికారులైన సీనియర్ ఇన్స్పెక్టర్ జిల్లాలోద్దీన్ సీనియర్ అసిస్టెంట్ సంతోష్ లు విచారణ చేపట్టారు. మొదట సహకార సంఘం కు సంబంధించిన బ్యాంకుకు వెళ్లి విచారణ చేశారు. నో డ్యూ సర్టిఫికెట్ లేకుండానే ఏ విధంగా రుణాలు ఇచ్చారని సంబంధిత బ్యాంకు మేనేజర్ ని అధికారులు అడగడం జరిగింది. అయితే ఈ విషయం తమకు తెలియదని సహకార సంఘం వారికి ఈ విషయం తెలుసని తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అనంతరం సహకార సంఘం కార్యాలయంలో బాధిత రైతు గంగాధర్ భార్య పుష్పను ఈ విషయమై అడగడం జరిగింది. అయితే తమకు బ్యాంకులో అప్పు లేదని, తమకు తెలియకుండానే 68 వేల పై చిలుకు అప్పు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారని వివరించింది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము రుణమాఫీకి దూరం కావడం జరిగిందన్నారు. అయితే వాస్తవానికి తులసి గంగాధర్ అనే రైతు తీసుకున్న అప్పును తన భర్త తూము గంగాధర్ పై ఉన్నట్లు పేర్కొన్నారు అన్నారు. ఆపరేటర్ల తప్పిదం వల్ల తను అన్యాయం జరిగిందని, రైతు కుటుంబీకులు వాపోయారు. అయితే విచారణకు వచ్చిన అధికారులు సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలను చూసి అవాక్కయ్యారు. ఒక రైతుకు ఒకే సర్వే నెంబర్ పై రెండు బ్యాంకులు రుణం ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. అప్పటి సీఈఓ తోపాటు పాలకవర్గం సంబంధించిన కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయని అధికారుల దృష్టికి రావడం జరిగింది. జరిగిన అక్రమాలపై జిల్లా కోపరేటివ్ అధికారికి వివరిస్తామని నష్టపోయిన వారు ఆందోళన చదవద్దని అధికారులు అధికారులు పేర్కొన్నారు .రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. సహకార సంఘంలో జరిగిన అక్రమాల విషయమై తాము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని సహకార సంఘం డైరెక్టర్లు జి రాజు యాదవ్ చెట్ల ఉమేష్ ధ్యాగల నారాయణ లు పేర్కొన్నారు. గతంలో ఒక్కో రైతుకు ఒకే పట్టా పాస్ బుక్ నెంబర్ పైన రెండు బ్యాంకుల్లో నో డ్యూ సర్టిఫికెట్ చూడకుండానే మామూలు దండుకొని రుణాలు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశాలు అప్పటి చైర్మన్ ఏర్పాటు చేయలేదని ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వచ్చింది అన్నారు. ఏది ఏమైనా సహకార సంఘంలో జరిగిన అక్రమాలపై చైర్మన్ ను బాధ్యులు చేస్తూ విధుల నుంచి తప్పించాలని సహకార సంఘంలో జరుగుతున్న అక్రమాలను సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *