Dr. Naveen Reddy: వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి : డాక్టర్ నవీన్ రెడ్డి

సిరాన్యూస్‌, బోథ్‌
వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించాలి : డాక్టర్ నవీన్ రెడ్డి

హాస్టల్లో చదివే విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సొనాల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవీన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్‌ మండలంలోని కౌట(బి) బీసీ హాస్టల్ తో పాటు బోథ్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహం, సోనాల గిరిజన బాలుర వసతి గృహాలను డాక్టర్ నవీన్ రెడ్డి సందర్శించారు. ఈసంద‌ర్బంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంత‌రం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సోకే వ్యాధులు అపరిశుభ్రత వల్ల వస్తాయన్నారు. ఈగలు, దోమలు ఉండకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండ‌కుండా ఉంచుకోవాలని కోరారు. మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు దోమ కాటు వల్ల వస్తాయని తెలిపారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయా హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో ఆర్ బిఎస్ కే టీం సభ్యులు, డాక్టర్ సాగర్ స్వప్న, ఫార్మసిస్ట్ ఓం ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *