ANM Chandrakala: సాంగ్విలో వైద్య పరీక్షలు : ఏఎన్ఎం చంద్రకళ 

సిరాన్యూస్‌, బోథ్‌
సాంగ్విలో వైద్య పరీక్షలు : ఏఎన్ఎం చంద్రకళ 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జ్వరాల తీవ్రత పై వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. అన్ని గ్రామాలలో తిరుగుతూ జ్వరం బారిన పడిన వారికి మందులను అంద‌జేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం మండలంలోని సాంగ్వి గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడ్డ వారికి మందులను అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా ఏఎన్ఎం చంద్రకళ మాట్లాడారు. వ్యాధులు వ‌స్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని , దోమల బారి నుండి కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *