సిరా న్యూస్,మంథని ;
లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని మరియు సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉచిత కంటి పరీక్షలు, బి.పి, షుగర్ టెస్టులు నిర్వహించారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్స్ కూడా చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు మేడగొని వెంకటేష్, ఆప్టోమెట్రిస్ట్ బుద్దార్తి సతీష్ కుమార్, కుందారం గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణు వర్ధన్, ట్రస్ట్ సభ్యులు కుడుదుల రంజిత్, నార్ల విజయ్ భాస్కర్ లు పాల్గొన్నారు.