-నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు
సిరా న్యూస్,మంథని ;
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంథని ఆర్టీసీ బస్సు డిపోలో ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీజీఎస్ ఆర్టిసి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని ఉద్యోగులు తెలిపారు. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న పే స్కేల్ ప్రకటించాలని, బాండ్ పైసలు ఇప్పించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంథని డిపో ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ డిపో సెక్రటరీ వెంగళదాసు ఐలయ్య, కెకె.రెడ్డి, ఇకెఎం రావు , జనార్ధన్, మహేందర్, ఏసుమని లతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.