మంత్రి పొన్నం
సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల;
వేములవాడ లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. వేములవాడ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. స్వామి వారి పూజ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ రాజ రాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేములవాడ ఆలయం పై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక భక్తులు వచ్చే ఆలయం. ఆలయం మరింత అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వ పక్షాన దేవాలయానికి వచ్చే భక్తుల సౌకర్యానికి అనుగుణంగా శాస్త్రోక్తంగా వేదపడింతుల ,శృంగేరి పీఠాధిపతి సలహా సూచన మేరకు ఆలయ విస్తరణ చేస్తామని అన్నారు. శివుని ఆశీర్వాదం అడుగుతున్నాం. నేను ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కలిసి
తిరుమల లో ఉన్న నిత్యాన్నదాన కార్యక్రమం లాగ వేములవాడ లో కూడా నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేస్తాం. భక్తులు ,దాతలు కూడా సహకరించాలి. రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన సత్రం ప్రారంభించాలని అనుకుంటున్నాం. తిరుమల లో వెంగమాంబ సత్రం మాదిరి వంటకి సంబంధించి అత్యాధునిక సామాగ్రి తో సహా అన్ని ఏర్పాట్లు చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాధించాలి. తిరుపతి లో అన్నదాన సత్రం ప్రారంభించిన ఎన్టీఆర్ గారిని జ్ఞాపకం ఉంచుకుంటామని అన్నారు.
వేములవాడ లో భక్తులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే వారినీ జ్ఞాపకం ఉంచుకుంటాం. ఎన్ని కష్టాలు వచ్చిన అందరూ సహకరించాలి.. భక్తులు అంత స్వచ్ఛంద సంస్థలు దేవాలయానికి సహకరించాలి. నిత్యాన్నదాన సత్రం ప్రభుత్వం నుండి భవన నిర్మాణానికి ఆది శ్రీనివాస్ తో కలిసి పూనుకున్నాం. కార్తీక మాసం వరకు ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇది దక్షణ కాశి..భక్తులు కోడెలు కట్టేస్తారు. నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే భవిష్యత్ లో వేములవాడ గోశాల కి ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారి శ్రీనివాస్ ను పంపించారు..వేములవాడ లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని టూరిజం కి అప్పగించారు. స్వచ్చందంగా కుల సంఘాలు సత్రాలు కట్టుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ లో రైతాంగం అంత సమృద్ధిగా వర్షాలు కురుస్తూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ ఆ స్వామి వారిని కోరుకున్నా. భక్తులు ఇచ్చిన కోడె లు పక్కదారి పట్టకూడదు. మేము ఇద్దరం భక్తులంగా దేవాలయ అభివృద్ధి కృషి చేస్తాం. దేవాలయ దాతలకు హృదయ పూర్వక విజ్ఞప్తి చేస్తున్న ఆలయ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.