సిరాన్యూస్, కుందుర్పి
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి : ప్రిన్సిపాల్ అరుణ
* రుషి డిగ్రీ కళాశాల విద్యార్థుల శ్రమదానం
మన సంస్కృతి, సంప్రదాయాలను కాపా డుకుని, భవిష్యత్ తరాలకు అందించాలని రుషి డిగ్రీ కళాశాల అరుణ అన్నారు. బుధవారం కుందుర్పి మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న పురాతన దేవాలయాన్ని డిగ్రీ కాలేజ్ విద్యార్థులు శ్రమదానం చేశారు. ప్రిన్సిపాల్ అరుణ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు మణికంఠ నరేష్ పర్యవేక్షణలో పురాతన దేవాలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. గుడి ముందు అపరిశుభ్రంగా ఉన్న మండపాన్ని శుభ్రం చేశారు. విద్యార్థులు తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా విద్యార్థులు తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారని ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు.