మీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటా

లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్
హాస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు
బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణంపై మండిపాటు
బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం
సిరా న్యూస్,అనంతపురం;
లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్ అయ్యారు. అక్కడి హస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణం, బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం చూపించారు. ఏ సమస్య ఉన్నా స్వయంగా నాకు ఫోన్ చేయండని విద్యార్థులకు మంత్రి సవిత సూచించారు. మీ ఇళ్లల్లో పిల్లలను అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా…పురుగుల అన్నం పెడతారా..? మీ తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం…అని లేపాక్షి ఎంజేపీ బీసీ సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిని, వార్డెన్ ను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *