బీఆర్ఎస్ వలె పీఆర్సీ ఇవ్వాలి

సిరా న్యూస్,కోరుట్ల;
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వలెనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు,పెన్షనర్లకు 43 శాతం పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం కోరారు.సోమవారం తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అస్సోసియేషన్ కోరుట్ల డివిజన్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం పక్షోత్సావాలు(17 డిసెంబర్ 2023 నుండి 02 జనవరి 2024 )సందర్భంగా డిమాండ్ల దినం నిర్వహించారు.ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ మా రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సమస్యల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. గత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తమకు అన్ని విధాలా సహకరించిననందుకు కృతజ్ఞతలు తెలుపు తున్నామని,ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తమకు అండగా ఉంటామని నిన్న జరిగిన జాతీయ పెన్షనర్స్ దినోత్సవం లో తెలిపి నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. పెన్షనర్లకు అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత ఉచిత వైద్య సేవలు అందించాలని,ప్రతినెలా 1వ తేదీన పెన్షన్ జమ చేయాలని,పెన్షన్ కమ్యూటేషన్ కాల పరిమితి 12 ఏళ్లకు పెంచాలని,వైద్య ఖర్చుల బిల్లులు,పెన్షనర్స్ సంబంధించిన బిల్లులు సత్వరం విడుదల చేయాలని,జగిత్యాల జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు చేయాలని తమ అస్సోసియేషన్ ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్,కోశాధికారి నల్లాల లక్ష్మీ నారాయణ,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దీన్,రాములు,చిలుక గంగారాం,రాజయ్య,తుంబురు స్వామి,కోరుట్ల,మేడిపల్లి,కథలాపూర్,మండల శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *