సిరా న్యూస్,జగిత్యాల;
శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయలో బుధవారం జగిత్యాల డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు జరిపి అనంతరం ఆలయం 62వ వార్షికోత్సవం తేదీ:30-08-2024 శుక్ర వారం నుండి 02-09-2024 సోమవారం వరకు జరుగు ఉత్సవ ప్రచార రథంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గాజుల రాజేందర్, నాగమల్ల మనోహర్, గాజోజి రాజగోపాల్ చారి, రాఘవ చారి, అయిలా చంద్ర ప్రకాశ్, తుమ్మనపెల్లి సుగుణాకర్, కొయ్యడ సత్యనారాయణ, వడ్లురి హరికృష్ణ , సత్యజిత్ , ప్రవీణ్,అరుణ్, ఆలయ పూజారి అంగడి మఠం చరణ్ పాల్గొన్నారు.