SSUS Padala Ravinder: క్రమబద్దీకరణ హామీ నిలబెట్టుకోవాలి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్

సిరాన్యూస్,ఆదిలాబాద్‌
క్రమబద్దీకరణ హామీ నిలబెట్టుకోవాలి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్
* కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష
* జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని అసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ డిమాండ్ చేశారు..న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉద్యోగులు మహా ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు.అనంతరం జిల్లా పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రెగ్యులరైజ్ చేస్తామని బేసిక్ పే ( మినిమం టైం స్కేల్ ) అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చి ఇప్పుడు తస్సారం చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రితో సహా మంత్రులను అనేకసార్లు కలిసిన తమ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆందోళన చేపడుతున్నామన్నారు.. తమను రెగ్యులరైజ్ చేసే వరకు దశలవారీగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నేతలు ప్రకాష్, పార్థసారథి, వెంకటి ,కవిత, మమత దేవదర్శన్, ప్రవీణ్, సోమన్న, ప్రవీణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక…
దిక్షానంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవoగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా భోజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ గా చందు, ప్రధాన కార్యదర్శిగా కవిత, కోశాధికారిగా కేశవ్, అధికార ప్రతినిధిగా సోమన్న, ఉపాధ్యక్షులుగా ప్రదీప్ భరత్ దర్శన్ అనిల్ రాకేష్, మహిళా అధ్యక్షులుగా మమత, రత్న తో పాటు సభ్యులను ఎన్నుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *