సిరాన్యూస్,ఆదిలాబాద్
అడ్డి భోజారెడ్డికి మతిభ్రమించింది : డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్
డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని డీసీసీబీ డైరెక్టర్ పరమేశ్వర్ విమర్శించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్బంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు. అన్నదాతలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో వారికి అండగా నిలిచి రైతుల పక్షాన నిలబడి పోరాడిన మాజీ మంత్రి జోగురామన్నపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ బ్యాంకు పరిధిలోనే దాదాపు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు కష్టం వచ్చిందని అండగా నిలబడిన మాజీ మంత్రిపై వ్యక్తిగత దూషణలు చేస్తూ అన్నదాతలకు జరిగిన అన్యాయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా అనవసర ఆరోపణలు, దుష్ప్ర్పదారాలు మాని రైతులకు న్యాయం జరిగే విదంగా చూడాలన్నారు. అన్నదాతలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని పునరుద్ఘాటించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, నాయకులు,కొమ్ర రాజు , నవాతే శ్రీనివాస్, తమల సతీష్, జవ్వాజి దయానంద్, తదితరులు పాల్గొన్నారు.