సిరా న్యూస్,హైదరాబాద్;
మెట్రో రైల్ ప్రయాణికుల నుండి పార్కింగ్ చార్జీలు వసూళ్ళను మెట్రో సంస్థ, ఎల్ అండ్ టి సంస్థలు శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని డైమండ్ చేస్తూ ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ఏఐవైఎఫ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ వద్ద ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో ప్రయాణికులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత మెట్రో సంస్థదే అన్నారు. ప్రభుత్వ భూములను ఉచితంగా తీసుకుని, వాటిలో ఎటువంటి కనీస వసతులు కల్పించకుండా, ప్రయాణికులు వాహనాలు నిలిపితే పార్కింగ్ చార్జీల పేరుతో దండుకోవడం సరికాదన్నారు.
ప్రయాణికుడు అప్పటికే మెట్రో ట్రైన్ కి వందల రూపాయలు చార్జీలు చెల్లిస్తున్నారని, మళ్లీ పార్కింగ్ పేరుతో వసూలు చేయడం, ప్రయాణికులకు అధిక భారం పడుతుందన్నారు. తక్షణమే నాగోల్, మియాపూర్, మిగతా అన్ని స్టేషన్లలో ఉచిత పార్కింగ్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే యువజన సంఘాలు ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, డి.వై.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ , పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్ ప్రదీప్ లు తదితరులు పాల్గొన్నారు…